Business

HYD-VJA మధ్య మరో కొత్త రైల్వే మార్గం

HYD-VJA మధ్య మరో కొత్త రైల్వే మార్గం

తెలంగాణలో కీలకంగా ఉన్న మోటుమర్రి-విష్ణుపురం సింగిల్‌ రైల్వే లైన్‌(88.81 కి.మీ.)ను డబుల్‌ లైన్‌గా విస్తరించనున్నారు. ప్రధానమంత్రి అధ్యక్షతన గురువారం దిల్లీలో జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఈ పనుల అంచనా వ్యయం రూ.1,746.20 కోట్లు. ఈ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌-విజయవాడకు మరో ప్రత్యామ్నాయ మార్గంతోపాటు దగ్గరి దారి అవుతుంది. ఈ డబ్లింగ్‌ ప్రాజెక్టులో మోటుమర్రి వద్ద 10.87 కి.మీ. మేర రైల్‌ ఓవర్‌ రైల్‌ ప్రాజెక్టు రానుంది. కింద ఒక రైలు వెళుతుంటే దానిపై వంతెన నుంచి మరొకటి వెళుతుంది. ద.మ.రైల్వే పరిధిలో ఇలాంటిది విజయవాడలో ఒకటి ఉండగా.. ఇది రెండోది అవుతుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z