NRI-NRT

అమెరికాలో మహబూబ్‌నగర్ ప్రవాసులకు కారు ప్రమాదం. ఏడాది బాలుడు మృతి.

అమెరికాలో మహబూబ్‌నగర్ ప్రవాసులకు కారు ప్రమాదం. ఏడాది బాలుడు మృతి.

అమెరికా(USA)లోని ఫ్లొరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ జంట తమ శిశువును కోల్పోయింది. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన బొమ్మిడి అనూష, కొమ్మారెడ్డి సుశీల్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల తమ కుమారుడు అద్వైత్‌(11)కు కార్నైల్‌ ఫేషియల్‌ థెరపీ చేయించి తిరిగి వస్తున్న సమయంలో స్టేట్‌ రోడ్‌ 73లో కాటన్‌డేల్‌ వద్ద వీరి కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడాది వయసున్న వారి చిన్న కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ శిశువును రక్షించడానికి హెలికాప్టర్‌లో వైద్యశాలకు తరలించినా ప్రయోజనం లేదు. ఈ ఘటనలో సుశీల్‌, అనూష, అద్వైత్‌ తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రస్తుతం డోథన్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అద్వైత్‌, సుశీల్‌ ఐసీయూలో ఉన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z