DailyDose

మంత్రి సురేష్ కు అస్వస్థత

Auto Draft

రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు జరిగిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో మంత్రి ఉత్సాహంగా పాల్గొని పలు సభల్లో మాట్లాడారు. అనంతరం అస్వస్థత కు గురికావడంతో వైద్యశాలలో పరీక్షలు నిర్వహించారు. యాంజియోగ్రామ్ చేసిన వైద్యులు అత్యవసరంగా యాంజియోప్లాస్టి చేశారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోన్లో మంత్రితో మాట్లాడి పరామర్శించారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం మంత్రి సురేష్ అస్వస్థత నుంచి కోలుకున్నారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తన గురించి ఆందోళన చెంది ప్రార్ధనలు చేసిన నాయకులకు అభిమానులకు, శ్రేయోభిలాషులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు…!!