తాను జీవితంలో పెళ్లే చేసుకోను అని సంచలన నటి వరలక్ష్మీ శరత్కుమార్ మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయం గురించి ఈమె ఇంతకు ముందే చెప్పిన విషయం తెలిసిందే. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటి వరలక్ష్మీ శరత్కుమార్. వాటిలో ఒకటి నటుడు విమల్కు జంటగా నటించిన చిత్రం కన్నిరాశి. కింగ్ మూవీ మేకర్స్ పతాకంపై షమీమ్ ఇబ్రహీం నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ముత్తుకుమార్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం చెన్నైలోని ఒక నక్షత్రహోటల్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దర్శకుడు ముత్తుకుమార్ మాట్లాడుతూ ఇదే తన తొలి చిత్రం అని తెలిపారు. దర్శకుడిగా అవకాశం కల్సించిన నిర్మాతకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. సంగీతదర్శకుడు విశాల్ చంద్రశేఖర్ సూపర్ సంగీతాన్ని అందించారని తెలిపారు. తదుపరి చిత్రంలోనూ ఆయనతో కలిసి పనిచేస్తానని అన్నారు.
కళ్యాణం ఇల్లే!
Related tags :