WorldWonders

పట్టాలపై నిద్రించిన 14మంది వలసకూలీలు దుర్మరణం

14 MIgrant Laborers Crushed By Goods Cargo Train In India

సహాయక చర్యలు…సమాచారం తెలుసుకున్న స్థానికులు, ఆర్​పీఎఫ్​ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

*** 07:55 May 08
అలసిపోయి…మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్​కు రైలు పట్టాల వెంట నడుచుకుంటూ వళ్తున్న వలసకార్మికులు.. మధ్యలో అలసిపోయి రైల్వే ట్రాక్​పై పడుకున్నారు. భుసావల్​- జాల్నా మధ్య కర్మాడ్​ వద్ద ఉదయం 5.15 గంటలకు ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

*** 07:47 May 08
మహారాష్ట్రలో రైలు ప్రమాదం… 14 మంది మృతి. మహారాష్ట్రలో ఘోరప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్​కు వెళ్లాల్సిన వలసకార్మికులు రైల్వే ట్రాక్​లపై నిద్రిస్తున్న సమయంలో ఔరంగాబాద్​ వద్ద గూడ్స్​ రైలు వారిమీదుగా వెళ్లింది. 14 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.