మాజీ హీరోయిన్, ఎంపీ నవనీత్ కౌర్ కరోనా బారిన పడ్డారు. తనతో పాటు తన భర్త రవి రానాకి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కొద్ది రోజుల క్రితం రవి రానా తండ్రి, తల్లి, కుమారుడు, కుమార్తెతో పాటు మరో ఆరుగురు కుటుంబ సభ్యులకి కరోనా సోకినట్టు ఆమె పేర్కొంది. వైరస్ సోకిన కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకునే క్రమంలో తనకి సోకిందని ఫేస్ బుక్ ద్వారా వెల్లడించింది. అభిమానుల ఆశీస్సులతో తాము త్వరగానే కోలుకుంటామని ఆశాభావం వ్యక్తం చేసింది. లాక్డౌన్ సమయంలో నవనీత్ కౌర్ తన నియోజకవర్గంలో ఉన్న పేదలకు తన వంతు సాయం చేసింది. నిత్యావసర సరుకులు అందించడంతో పాటు మాస్క్లు పంపిణీ చేసింది. కరోనాపై ప్రజలలో అవగాహన పెంచేలా పలు సూచనలు కూడా చేసింది. అయితే గత కొద్ది రోజులుగా తనతో ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నారో వారు కూడా కరోనా పరీక్షలు జరిపించుకోవాలని కోరింది నవనీత్. తెలుగులోను పలు చిత్రాలలో నటించింది నవనీత్. శీను వాసంతి లక్ష్మీ, యమదొంగ, రూమ్ మేట్స్, జగపతి, శతృవు తదితర చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరైంది. నవనీత్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ప్రార్ధిస్తున్నారు.
నవనీత్కు కరోనా
Related tags :