Health

ఇది విన్నారా…కరోనా కేసుల్లో ఇండియాకు ద్వితీయ స్థానం

ఇది విన్నారా…కరోనా కేసుల్లో ఇండియాకు ద్వితీయ స్థానం

దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. ఉదయం కేంద్రం వెల్లడించిన లెక్కల ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 41,13,811 కాగా.. మరణాల సంఖ్య 70,626గా ఉంది. తాజాగా ఆయా రాష్ట్రాలు వెల్లడించిన లెక్కల ప్రకారం దేశంలో కేసుల సంఖ్య 41.30 లక్షలు దాటింది. దీంతో అత్యధిక కేసులున్న బ్రెజిల్‌ను దాటేసి భారత్‌ రెండో స్థానానికి చేరింది. తొలి స్థానంలో అమెరికా (64,34,626), మూడో స్థానంలో బ్రెజిల్‌ (41,23,000), నాలుగో స్థానంలో రష్యా (10,25,505) ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 2.69 కోట్ల కేసులు, 8.80లక్షలకుపైగా మరణాలు నమోదయ్యాయి.