Devotional

ఎండిపోయిన గోదావరి

Godavari River Dried Out At Bhadrachalam Due To Hard Summer Season

భద్రాచలం వద్ద జలకళతో పరవళ్లు తొక్కే గోదావరి అడుగంటిపోయింది. ఎగువ భాగాన గోదావరిపై పలుచోట్ల ప్రాజెక్టులు, బ్యారేజీలు నిర్మిస్తుండటంతో గోదావరి తన సహజసిద్ధ రూపాన్ని కోల్పోయింది. భద్రాచలంలో 18 ఏళ్ల తర్వాత నది నీటి మట్టం 2.5 అడుగుల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఫలితంగా గోదావరి నదీ తీరంలో ఏర్పాటు చేసిన హైడల్‌ ప్రాజెక్టు, భారజల కర్మాగారం మూతపడ్డాయి.