Politics

అయ్యన్నపాత్రుడికి మావోయిస్టుల హెచ్చరిక

Maoists write warning letter to andhra minister ayyannapatrudu and kidari sravan-tnilive-అయ్యన్నపాత్రుడికి మావోయిస్టుల హెచ్చరిక

టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, కిడారి శ్రవణ్, గిడ్డి ఈశ్వరి, స్థానిక నేతలను హెచ్చరిస్తూ మావోయిస్ట్ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం పేరుతో లేఖ విడుదల చేశారు. మే 1న పనసలొద్ది, కొత్తవాదులపల్లి గ్రామాలపై పోలీసులు దాడి చేసి ఆరుగురు రైతులను చిత్రహింసలకు గురిచేశారని లేఖలో మావోస్టులు ప్రస్తావించారు. తక్షణమే వారిని విడుదల చేయాలని, లేదంటే ప్రజలు బుద్ధి చెబుతారని మావోయిస్ట్ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం హెచ్చరించారు.