Movies

యువతరంతో అమితాబ్

Amitabh Interested In Acting With Younger Generations-tnilive-telugu movie news latest nri nrt news america global news

యువ హీరోలతో కలసి తెరను పంచుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు అమితాబ్‌ బచ్చన్‌. ‘బ్రహ్మాస్త్ర’లో రణ్‌బీర్‌ కపూర్‌తో కలసి నటిస్తున్న ఆయన, ఇటీవలే ఇమ్రాన్‌ హష్మితో ఓ సినిమాకు సై అనేశారు. ‘చేహరే’ పేరుతో తెరకెక్కుతున్న ఆ సినిమా చిత్రీకరణ కూడా మొదలైపోయింది. తాజాగా మరో యువ కథానాయకుడు ఆయుష్మాన్‌ ఖురానాతోనూ కలసి నటించడానికి సిద్ధమయ్యారు అమితాబ్‌. ప్రముఖ దర్శకుడు సూజిత్‌ సర్కార్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గులాబో సితాబో’. ఇందులోని ప్రధాన పాత్రల్లో అమితాబ్‌, ఆయుష్మాన్‌ నటించనున్నట్లు సూజిత్‌ వెల్లడించారు. ఆయన తెరకెక్కించిన ‘విక్కీ డోనర్‌’తోనే ఆయుష్మాన్‌ తెరకు పరిచయమయ్యారు. ఇక సూజిత్‌ దర్శకత్వం వహించిన ‘పీకూ’లో నటించారు అమితాబ్‌. ఇప్పుడు తాజా చిత్రం కోసం వీరిద్దరినీ కలిపారు సూజిత్‌. ఇది కుటుంబ నేపథ్యంలో సాగే హాస్య ప్రధాన చిత్రమని సూజిత్‌ తెలిపారు. ఆయుష్మాన్‌ మాట్లాడుతూ ‘‘నేను నటుణ్ని కావాలని అనుకున్నప్పట్నుంచీ అమితాబ్‌తో కలసి నటించాలని కలలు కన్నాను. ఇప్పుడు ఆయనతో నటించబోతున్నానంటే నమ్మలేకపోతున్నాను. అంత ఆనందాన్ని కలిగిస్తోంద’’ని చెప్పారు ఆయుష్మాన్‌.