Business

ప్రేమ్‌జీ వారసుడిగా ఆయన కుమారుడు

Ajim Premjis Son Rishab Premji To Takeover Wipro Starting August

ప్రముఖ ఐటీ కంపెనీ విప్రోకు కొత్త వారసుడు రానున్నారు. ఆ కంపెనీ వ్యవస్థాపకులు.. ప్రస్తుతం కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా ఉన్న అజీమ్‌ ప్రేమ్‌జీ ఈ ఏడాది జులై 30న పదవీ విరమణ చేయనున్నారు. రిటైర్మెంట్‌ తర్వాత కంపెనీలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, వ్యవస్థాపక ఛైర్మన్‌ హోదాలో ఆయన కొనసాగనున్నారు. ఈ మేరకు ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం కంపెనీలో చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌గా, బోర్డు మెంబర్‌గా ఉన్న ప్రేమ్‌జీ తనయుడు రిషద్‌ ప్రేమ్‌జీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా నియమితులు కానున్నారు. చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న అబిదాలీ జడ్‌ నీముచ్‌వాలా ఇకపై సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. జులై 31 నుంచి ఈ నియామకాలు అమల్లోకి రానున్నాయని, ఈ మేరకు వాటాదారుల ఆమోదం లభించిందని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.