Politics

100శాతం ఫీజు రీఇంబర్స్‌మెంట్

YS Jagans Govt To Reimburse Fees Totally

ప్రభుత్వ బడులను బాగుచేయడాన్ని సవాల్‌గా తీసుకున్నామన్నారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ నిపుణుల కమిటీతో సీఎం సమావేశమయ్యారు. అమ్మ ఒడి, సంపూర్ణ ఫీజు రియింబర్స్‌ మెంట్, విద్యార్థులకు బోర్డింగ్‌ అండ్‌ లాడ్జింగ్‌ కింద ఏటా 20వేల రూపాయలు చెల్లింపుపై అధికారులతో చర్చించారు. వచ్చే జనవరి 26 నుంచి అమ్మ ఒడి అమలు చేస్తామన్నారు. స్కూలు దగ్గర నుంచి తిరిగి ఉన్నత విద్య పూర్తి చేసుకునేంత వరకూ డ్రాప్‌ అవుట్‌ లేకుండా చేయాలన్నారు జగన్‌. రాష్ట్రంలో 40వేల స్కూళ్లు ఉన్నాయన్న ఆయన… ప్రతి స్కూలును అభివృద్ధి చేస్తామన్నారు. . బాత్‌రూమ్స్, తాగునీరు, ఫర్నిచర్, బ్లాక్‌బోర్డ్స్, ఫ్యాన్లు, ప్రహరీ గోడలు, ఫినిషింగ్‌ వర్క్స్‌… ఇలా ప్రతి పనీ ప్రాధాన్యతా క్రమంలో చేపడతామన్నారు. ప్రతి పాఠశాలను ఇంగ్లిషు మీడియం చేస్తున్నామని.. తెలుగు భాషను తప్పనిసరి సబెక్ట్‌ చేస్తున్నట్లు తెలిపారు.ఇక.. మధ్యాహ్నభోజనం నాణ్యతను బాగా పెంచుతామన్నారు. ప్రతి విద్యార్ధికి 3 జతల యూనిఫారాలు, షూలు అందిస్తామన్న జగన్ విద్యార్థుల తల్లిదండ్రులకే స్టిచ్చింగ్‌ ఛార్జీలు ఇస్తున్నట్లు చెప్పారు. పిల్లలకు షూలు, సాక్సులకోసం డబ్బులు కూడా ఇస్తామన్నారు. అర్బన్‌ ప్రాంతాల్లో మధ్యాహ్నం భోజనం అక్షయపాత్రకు, రూరల్‌ ప్రాంతాల్లో ఇప్పుడున్న డ్వాక్రా గ్రూపులకు అప్పగిస్తామని తెలిపారు. ప్రతి పాఠశాలకు విద్యాకమిటీ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి పాఠశాల అభివృద్ది, పర్యవేక్షణ బాధ్యత ఈ కమిటీదేనన్నారు. క్రమం తప్పకుండా సమావేశమై స్కూలు బాగోగులను విద్యా కమిటీలు పర్యవేక్షించాలన్నారు. ఇక ఫీజుల మానిటరింగ్‌ కోసం ఒక నియంత్రణ వ్యవస్థను తెస్తామన్నారు. వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తామని జగన్ స్పష్టం చేశారు.