వినాయక చవితి పర్వదినాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ఇంటిలో అత్యంత వైభవంగా జరుపుకొంటున్నారు. ఇంద్ర భవనంలాంటి ఆయన ఇల్లు ఆంటిలియాను విద్యుత్ దీపాలతో ఎంతో అందంగా ముస్తాబు చేశారు. కేవలం ఇల్లే కాదు ఆ వీధి మొత్తం వెలుగులతో నిండిపోయింది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. వాటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అంబానీ కుటుంబ సభ్యులకు ఈ వినాయక చవితి ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ముకేశ్, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ పిరమాల్ వారసుడు ఆనంద్ను పెళ్లాడిన తర్వాత వచ్చిన మొదటి వినాయక చవితి ఇది. అదేవిధంగా ముకేశ్, నీతాల కుమారుడు ఆకాశ్ అంబానీ దంపతులకు కూడా ఇది తొలి వినాయక చవితి. ఆనంద్ ఇటీవల వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా చిన్న కుమార్తె శ్లోకను మనువాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంబానీ కుటుంబం ఈ పండగను అత్యంత ఘనంగా జరుపుకుంటోంది. వారం రోజుల క్రితం అంబానీ కుటుంబం అత్యంత సన్నిహితుల్ని పండగకు ఆహ్వానించింది. ఈ సందర్భంగా అంబానీ దంపతులు డిజైన్ చేయించిన ఆహ్వాన పత్రిక బయటికి వచ్చింది.