అమెరికాలో ప్రమాదవశాత్తు లేదా ప్రాకృతికంగా మృతిచెందిన వారి పార్థివదేహాలను భారతదేశం తరలించిన అనంతరం అక్కడి విమానాశ్రయాల నుండి స్వస్థలాలకు తరలించేందుకు ఉన్న అడ్డంకులు తొలగించేందుకు తానా టీంస్క్వేర్కు చక్కని చేయూత లభించింది. అమెరికాకు చెందిన పాలడుగు శిరీష టీంస్క్వేర్ విభాగ ఛైర్మన్ కొల్లా అశోక్బాబుకు $15వేల డాలర్ల చెక్కును విరాలంగా అందజేశారు. ఈ మొత్తంతో ఓ వాహనాన్ని కొనుగోలు చేసి విమానాశ్రయం నుండి స్వస్థలాలకు మృతదేహాలను తరలించేందుకు ఏర్పాటు చేయవల్సిందిగా ఆమె కోరినట్లు అశోక్ తెలిపారు. శిరీషకు తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, కార్యదర్శి పొట్లూరి రవిలు ధన్యవాదాలు తెలిపారు.
తానా టీంస్క్వేర్కు $15వేల డాలర్ల విరాళం
Related tags :