మొబైల్ ఫోన్ నంబర్లను 11 అంకెలకు మార్చాలని భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) యోచిస్తోంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న 10 అంకెల నంబర్లతో 210 కోట్ల మందికి సెల్ఫోన్ సేవలను అందించే అవకాశాలున్నాయి.
భవిష్యత్లో నంబర్ల కొరతను దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుతమున్న నంబర్లను 11 అంకెలకు మార్చాలని ట్రాయ్ ఆలోచిస్తోంది. త్వరలో దీనిపై ఓ నిర్ణయం తీసుకోనుంది.
ఈ నిర్ణయం 2050కల్లా ఉండే డిమాండ్కు అనుగుణంగా ఉంటుంది.