Devotional

అయోధ్య తీర్పు రిజర్వ్

Ayodhya Judgement Under Reserve By CJI

అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు విచారణను ముగించింది.

దాదాపు 40 రోజుల పాటు ఏకధాటిగా సుప్రీంకోర్టు ఈ కేసును విచారించింది.

చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యం వహించిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వైరి పక్షాల వాదనలను విన్నది.

ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు వాదనలను వింటామని సుప్రీంకోర్టు ప్రకటించినప్పటికీ… ఒక గంట ముందే అంటే 4 గంటలకే విచారణ ముగిసినట్టు ప్రకటించింది.

ఇంతకు మించి వినడానికి ఏమీ లేదని తెలిపింది. తుది తీర్పును పెండింగ్ లో ఉంచింది.

నవంబర్ 17న ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ లోగానే తుది తీర్పును వెలువరించే అవకాశాలు ఉన్నాయి.