న్యూజీల్యాండ్ తెలుగు సంఘం(NZTA)ఆధ్వర్యంలో న్యూజీల్యాండ్-ఆస్ట్రేలియా దేశాలకు చెందిన ప్రవాసుల సహకారంతో నిర్వహించనున్న మొదటి తెలుగు సాహితీ సదస్సుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని NZTA అధ్యక్షురాలు మగతల శ్రీలత తెలిపారు. ఏపీ అధికార భాష సంఘం అధ్యక్షులు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రముఖ కవి, రచయిత, నటులు తనికెళ్ల భరణిలు ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా హజరయి అధ్యక్షత వహిస్తారని ఆమె తెలిపారు. ఈ సదస్సుకు ఎంట్రీ ఫీజుగా $20 నిర్ణయించామని, రిజిస్ట్రేషన్ దరఖాస్తు ఈ లంకెలో సంస్థకు సమర్పించాలని ఆమె కోరారు. ఈ సదస్సు శని,ఆదివారాల్లో ఆక్ల్యాండ్లోని షిర్డీ సాయిబాబా ఆలయంలో నిర్వహిస్తున్నారు.
Registration Link – https://forms.gle/rTTizm8VMTLa9v1F9
న్యూజీల్యాండ్-ఆస్ట్రేలియా మొదటి తెలుగు సాహితీ సదస్సు రిజిస్ట్రేషన్ సమాచారం
Related tags :