Movies

ముందస్తు అభిప్రాయాలు ఏర్పరుచుకోకండి

Kriti Sanon Asks Not To Come To An Opinion Before Watching

అర్జున్‌కపూర్‌, కృతిసనన్‌, సంజయ్‌దత్‌ కీలకపాత్రల్లో అశుతోష్‌ గొవారికర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం ‘పానిపత్‌’. 1761లో జరిగిన యూడో పానిపత్‌ యుద్ధం ఆధారంగా చేసుకుని రూపొందుతున్న చిత్రమిది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు బాలీవుడ్‌ తారల నుంచి ప్రశంసలు లభించాయి. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఈ సినిమాలో కృతిసనన్‌ పోషించిన పార్వతీభాయ్‌ పాత్రను సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్‌’ చిత్రంలోని కాశీభాయ్‌ పాత్రతో పోలుస్తున్నారు. దీంతో ఈ విషయంపై ఇటీవల కృతిసనన్‌ స్పందించారు.తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు కృతి సనన్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఈ సినిమాకు సంతకం చేసినప్పుడే ఇలాంటి పోలీకలు వస్తాయని నేను భావించాను. అప్పట్లో ‘పద్మావత్‌’ చిత్రాన్ని కూడా ‘బాహుబలి’ చిత్రంతో పోల్చారు. ‘పానిపత్‌’, ‘బాజీరావ్‌ మస్తానీ’ ఒకే కాలానికి చెందిన చిత్రాలు. ఈ రెండు చిత్రాల్లోను కొన్ని విషయాలు ఒకేలా అనిపించడానికి కారణం.. ఈ రెండు సినిమాలు దాదాపుగా ఒకే కాలానికి చెందినవి. అలాగే ఈ రెండు సినిమాల్లోని పాత్రలు ఒకేవిధమైన వస్త్రాలంకరణలో కనిపించారు. ఎందుకంటే పీష్వాలకు ఓ ప్రత్యేకమైన వస్త్రాలంకరణ ఉంటుంది. కానీ ఈ రెండు సినిమాల్లో పాత్రలు మాత్రం ఒకేలా ఉండవు. కేవలం ట్రైలర్‌ ఒక్కదానినే చూసి సినిమాపై ఓ అభిప్రాయానికి రాకుడదని భావిస్తున్నాను.’ కృతిసనన్‌ తెలిపారు.