Agriculture

తెలంగాణా రైతు సమన్వయ సమితి ఛైర్మన్‌గా పల్లా

Palla Rajeswar Reddy Appointed As Telangana Farmer Co-Ordination Committee-తెలంగాణా రైతు సమన్వయ సమితి ఛైర్మన్‌గా పల్లా

రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, డైరెక్టర్‌గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. క్యాబినెట్ మినిస్టర్ హోదా కలిగిన ఈ పదవిలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. తనను రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమించడంపై హర్షం వ్యక్తం చేస్తూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం.. పల్లాకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర రైతాంగాన్ని ఓ సంఘటిత శక్తిగా మార్చే సత్సంకల్పంతో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు.