Business

ఏపీలో మస్తుగా మత్తు మద్యం బానిసలు

Andhra Liquor And Drug Addicts Are At 13.7 Percent

దేశంలో సగటున 10.5 శాతం మందిమద్యానికి బానిసలైతే.. ఆంధ్రప్రదేశ్‌లో ఆ సంఖ్య 13.7 శాతం. మద్యంసేవించే వారి సంఖ్య జనాభా పరంగా చూస్తే దేశంలో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలోనిలుస్తోంది. మద్యంతో పాటు మాదక ద్రవ్యాల వినియోగంలోనూ రాష్ట్రం తీసిపోలేదు.కొకైన్,హెరాయిన్, బ్రౌన్‌షుగర్‌కు బానిసలైన వారిలో పిల్లలు, యువతే అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు (ఎయిమ్స్‌) అనుబంధంగాపనిచేసే నేషనల్‌ డ్రగ్‌ డిపెండెన్స్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్‌(ఎన్‌డీడీటీసీ)నిర్వహించిన సర్వేలో పలు విస్మయకర అంశాలు వెలుగుచూశాయి.*దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2017 నుంచి 2018 డిసెంబర్‌వరకు ఈ సర్వే నిర్వహించారు. 186 జిల్లాల్లో 4,73,569 మందిని ప్రశి్నంచి, నివేదికరూపొందించారు. 135 జిల్లాల్లోమాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డ 72,642 మందిని ప్రశ్నించారు. మాదక ద్రవ్యాలు, నిషేధితడ్రగ్స్,మద్యానికిబానిసలైన వారిపై ఇంత పెద్ద ఎత్తున సర్వే చేయడం దేశంలో ఇదే తొలిసారి. ఈ సర్వేవివరాలను కేంద్ర సామాజిక సాధికారిత శాఖ వెల్లడించింది. ప్రభుత్వానికి పలుసిఫార్సులు చేసింది. ఈ సర్వేను 8 కేటగిరిల్లో నిర్వహించారు. మద్యం లేకపోతేఉండలేమనే స్థితికి చేరుకోవడం, గంజాయి, నల్లమందు, డ్రగ్స్‌ వాడడం, ఇంజక్షన్లద్వారా డ్రగ్స్‌ తీసుకోవడం లేదా మత్తు కోసం రసాయన పదార్థాలను పీల్చడం, ప్రమాదకరడ్రగ్స్‌ వినియోగం ఎలా మాన్పించాలి అనే అంశాల ఆధారంగా సర్వే చేపట్టారు.**సర్వేలోఏం తేలిందంటే..
*ప్రధానంగా 10 నుంచి 75 ఏళ్ల లోపువారు ఎక్కువగా మద్యానికి బానిసలవుతున్నారు.
*దేశజనాభాలో సగటున 10.5శాతంమంది మద్యం బానిసలు కాగా,ఏపీలోదేశ సగటును మించి మద్యం బానిసలున్నారు.
*జనాభాపరంగాచూస్తే దేశవ్యాప్తంగా మద్యం బానిసల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉంది. *మద్యం వినియోగంలోనూ ఏపీ నాలుగోస్థానంలో నిలిచింది.
*దేశంలోమద్యం వినియోగం 18.5శాతంకాగా, ఏపీలో 43.5 శాతం.
*మద్యానికిబానిసలై వైద్యం కోసం ఎదురు చూస్తున్న వారిలో ఏపీ రెండో స్థానంలో ఉంది.
*దేశవ్యాప్తంగాఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్‌ తీసుకుంటున్న వారు 8.5 లక్షల మంది ఉండగా, ఏపీలో 69 వేల మందిఉన్నారు. ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్‌ ఎక్కువగా తీసుకుంటున్న రాష్ట్రాల్లో యూపీ, పంజాబ్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, నాగాలాండ్‌ఉన్నాయి.
*దేశంలోమద్యం సేవించే మహిళలు,పురుషులనిష్పత్తి 1:17గా ఉంది.
*ఏపీలో 10 నుంచి 17 ఏళ్ల లోపువారిలో 1.37 శాతం మందికొకైన్‌ వినియోగిస్తున్నారు.
*ఏపీలోనల్లమందు లాంటి మత్తు పదార్థాలు సేవిస్తూ 1.4 లక్షల మంది ప్రమాదం అంచున ఉన్నారు.
*నిద్రపుచ్చేమత్తు పదార్థాలను తీసుకునే వారు ఏపీలో 0.80 శాతం మంది ఉన్నారు.
*ఏపీలో 10 నుంచి 75 ఏళ్ల లోపువారిలో 0.2శాతంమంది గంజాయి సేవిస్తున్నారు.
*నిద్రపుచ్చేమత్తు మందుల వినియోగంతో సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఏపీలో 3.6 లక్షల మందిఉన్నారు.***ప్రత్యేకవ్యవస్థ అవసరం
*మద్యం, డ్రగ్స్‌వ్యసనాన్ని దూరం చేసేందుకు దేశవ్యాప్తంగా భారీగా డీ అడిక్షన్‌ కేంద్రాలను ఏర్పాటుచేయాలి.
*మద్యం, డ్రగ్స్‌వ్యసనపరులను ఇన్‌ పేషెంట్లుగా ఆసుపత్రుల్లో చేర్చుకోవాలి. ప్రస్తుతం ఓపీ క్లినిక్‌లుమాత్రమే ఉన్నాయి.
*మద్యపానాన్నినియంత్రించేందుకు,మాదకద్రవ్యాలను అందుబాటులో లేకుండా చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.ఇందుకోసం తగినంత సిబ్బందిని సమకూర్చాలి.
*దేశంలోకిడ్రగ్స్‌ ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. *2018 డిసెంబర్‌ నాటికి ఏపీలో మద్యంబానిసలు13.7%మంది*దేశ సగటు కంటే అధికం.. జనాభా పరంగాదేశంలో నాలుగో స్థానం
*సాయంకోసం ఎదురుచూస్తున్న బాధితులు రాష్ట్రంలో 47 లక్షలు మంది
*ఏపీలో ఇంజక్షన్లద్వారా డ్రగ్స్‌ తీసుకుంటున్న వారు 69 వేల మంది