NRI-NRT

తామా ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు

TAMA Celebrates 71st Indian Republic Day In Atlanta

మెట్రో అట్లాంటా తెలుగు సంఘం(తామా) ఆధ్వర్యంలో 71వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ గీతాలాపన అనంతరం జెండావందనం చేశారు. అనంతరం ప్రసంగించిన వక్తలు గణతంత్ర దినోత్సవ ప్రత్యేకతను వివరించారు. కార్యక్రమంలో తామా అధ్యక్షుడు భరత్ మద్దినేని, సాంఘికసేవా కార్యదర్శి సాయిరామ్ కారుమంచి, ముఖ్య అతిథులు నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంత గణిత అధ్యాపకుడు ప్రభాకర్ కడియాల, రాయచూరుకు చెందిన రైతు నాగేశ్వరరావు వలిచేటి, వరంగల్ విశ్రాంత ఉపాధ్యాయులు సోమయ్య కాసాని, రామ్ మద్ది, అంజయ్య లావు, బోర్డు ఛైర్మన్ రాజశేఖర్ చుండూరి తదితరులు పాల్గొన్నారు.