Business

భారతీయ పర్యాటకులపై భూటాన్ భారం

Bhutan Imposes Daily Fees On Indian Tourists

తమ దేశానికి వచ్చే భారతీయ పర్యాటకులు రోజుకు రూ.1200 ఫీజును చెల్లించాలనే నిబంధన భూటాన్‌ దిగువ సభ ఆమోదాన్ని పొందింది. తమ దేశ సుస్థిరాభివృద్ది కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఈ నిబంధన బంగ్లాదేశ్, మాల్దీవుల నుంచి భూటాన్‌కు వచ్చే పర్యాటకులకు కూడా వర్తిస్తుంది. జులై నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది. ఈ హిమాలయ రాజ్యం పర్యావరణానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తుందన్న సంగతి తెలిసిందే. కాగా భారత్‌ నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు భూటాన్‌ తెలిపింది. ఈ మూడు దేశాల నుంచి భూటాన్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య అంతకుముందు ఏడాది కంటే 2019లో 10 శాతం పెరిగింది. అయితే ఈ బిల్లు భూటాన్‌ నేషనల్‌ అసెంబ్లీలో ఇంకా చర్చల్లోనే ఉందని… ఈ ఫీజు నామమాత్రంగా పెరిగే అవకాశం ఉందని భారత అధికారులు అంటున్నారు.