NRI-NRT

అమరావతి రైతులకు ప్రవాసాంధ్రుల చేయూత

USA Telugu NRIs Helping Amaravathi Protesters With 15Lakhs-అమరావతి రైతులకు ప్రవాసాంధ్రుల చేయూత

గత 3నెలలుగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళనకు అమెరికాకు చెందిన ప్రవాసాంధ్రులు తమ మద్దతును ప్రకటించారు. ఈ ఉద్యమానికి తమవంతు విరాళంగా ₹15లక్షల రూపాయిలను ప్రకటించారు. ఈ మొత్తాన్ని బుధవారం నాడు అమరావతిలో ఉద్యమాన్ని నిర్వహిస్తున్న JAC నాయకులకు ఉదయం 11గంటలకు చంద్రబాబు చేతుల మీదుగా అందజేయనున్నారు. తెదేపా జాతీయ కార్యాలయం సమీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ విరాళాలను అమెరికా అంతటా ఉన్న ప్రవాసాంధ్రుల వద్ద నుండి సేకరించే కార్యక్రమాన్ని మలినేని ఠాగూర్, బొలినేని సాయి, గుమ్మడి రత్నప్రసాద్ తదితరులు సమన్వయపరుస్తున్నారు.