NRI-NRT

కరోనా బాధితులకు దక్షిణాఫ్రికా ప్రవాసుల వితరణ

కరోనా బాధితులకు దక్షిణాఫ్రికా ప్రవాసుల వితరణ

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరించిన విషయం తెలిసిందే. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పలు దేశాలు లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. లాక్‌డౌన్‌ విధింపుతో సకలం బంద్‌ అయ్యాయి. నిరుపేదలు, వలస కూలీలు రోజువారీ జీవనానికి సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటే దుస్థితే దక్షిణాఫ్రికాలో నెలకొంది. జింబాబ్వే, జాంబియా, మలావి వంటి పేద దేశాల నుండి ఎంతోమంది వలస కార్మికులు పొట్టచేతపట్టుకుని దక్షిణాఫ్రికాకు వలసొచ్చారు. ప్రస్తుత కాలంలో వీరందరి జీవనం దయనీయంగా మారింది. ఈ పరిస్థితులను చూసిన స్థానిక తెలుగు ప్రజలంతా ఒక్కటై గొప్ప మానవతా థృక్పథాన్ని చాటుతూ సహాయం అందించారు. తమకు చేతనైనంతలో చేయూత అందించడానికి ముందుకొచ్చారు.