మద్యం దుకాణాల ముందు ప్రజలు కిలోమీటర్ల మేర బారులుతీరడం తనను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. లాక్డౌన్ కారణంగా మూతపడిన మద్యం దుకాణాలు ఏపీలోని గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నేటి నుంచి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. మద్యం కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారని ముందుగానే ఊహించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉదాసినంగా వ్యవహరించిందని చంద్రబాబు మండిపడ్డారు. సరైన ప్రణాళిక లేకుండా సీఎం జగన్ వ్యవహరించటం వల్ల ప్రజల్లో భౌతికదూరం పాటించాలనే స్ఫూర్తి దెబ్బతిందన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా పెరిగేందుకు ఉపకరించేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని చంద్రబాబు విమర్శించారు.
ఏమిటండీ ఇది?వాట్ ఈజ్ దిస్?
Related tags :