Health

అగ్రరాజ్యంలో ఆగని మృత్యుఢంకా

1635 Lives Lost In 24 Hours Due To COVID19 In USA

అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్‌ మృత్యుఢంకా మోగిస్తోంది. శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న కొవిడ్‌-19 కార‌ణంగా అమెరిక‌న్లు పిట్ట‌లా రాలిపోతున్నారు. క‌రోనా క‌ట్ట‌డికి అగ్ర‌రాజ్యం ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న ఆ దేశంలో మృత్యుహేల ఆగ‌డం లేదు. గ‌త 24 గంట‌ల్లోనే 1,635 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు యూఎస్‌లో ఈ వైర‌స్ వ‌ల్ల చ‌నిపోయి వారి సంఖ్య 77,178కి చేరింద‌ని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం పేర్కొంది. అలాగే 12.83 ల‌క్ష‌ల మంది క‌రోనా బాధితులు ఉన్నారు. మ‌రోవైపు ట్రంప్ ఈ మ‌హ‌మ్మారికి ఎలాంటి వ్యాక్సీన్ అవ‌స‌రం లేద‌ని, త‌నంత‌టా తానే వెళ్లిపోతుంద‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.