Sports

వారి వలనే వెనుకబడ్డాడు

Pak Cricketer Rashid Lateef On Virender Sehwag

టీమ్‌ ఇండియా మాజీ ఓపెనర్‌, డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. సెహ్వాగ్‌ను ఔట్‌ చేస్తే, సగం మ్యాచ్‌ గెలిచినట్లేనని చాలా మంది భావించేవారు. అయితే సెహ్వాగ్‌ భారత్‌ తరపున కాకుండా మరో దేశానికి ఆడి ఉంటే టెస్టుల్లో సులభంగా 10వేల పరుగుల మైలురాయిని దాటేవాడని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ లతీఫ్‌ రషీద్‌ అభిప్రాయపడ్డాడు. సచిన్‌, రాహుల్‌ ద్రవిడ్‌ వంటి క్రికెట్‌ దిగ్గజాలు టీమ్‌ ఇండియాలో ఉండటం వల్ల సెహ్వాగ్‌ వారి వెనుకే ఉండిపోయాడని అన్నాడు.