మహానాడులో భాగమైన ఎన్నారై టీడీపీ. జన్మభూమి రుణం తీర్చుకున్న ఎన్నారైలు. నందమూరి తారకరామారావు 97వ జయంతి సందర్భంగా ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలోని 25 ముఖ్య నగరాల్లో పదివేల మంది నిరుపేద బ్రాహ్మణ, క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీ, బిసి కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమాన్ని రాజమండ్రిలో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, విజయవాడలో గద్దె రామ్మోహన్, బోండా ఉమా, విజయనగరంలో అశోక్గజపతిరాజు, నందిగామలో తంగిరాల సౌమ్య తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఏపీలో 10వేల కుటుంబాలకు ఎన్నారై తెదేపా సాయం
Related tags :