సమగ్ర భూ సర్వేపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష
సమగ్ర భూ సర్వేపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష
క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, ల్యాండ్ అండ్ ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి తదితర అధికారులు పాల్గొన్నారు.
సమగ్ర భూ సర్వే కోసం తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించిన అధికారులు
గ్రామ సచివాలయాల పరిధిలో సర్వే చేస్తామన్న అధికారులు
ఈ సర్వే సందర్భంగా ఏమైనా వివాదాలు వస్తే పరిష్కరించడానికి మొబైల్ కోర్టులు ఏర్పాటు చేస్తామని వెల్లడి
డిప్యూటీ కలెక్టర్ల స్థాయిలో మొబైల్ కోర్టులు నడుస్తాయన్న అధికారులు
దీంతో రికార్డుల ప్రక్షాళన అవుతుందన్న అధికారులు
సర్వే వివరాలను ఎప్పటికప్పుడు డిజిటల్ పద్ధతిలో భద్రపరుస్తామని, ఈ డిజిటల్ సమాచారాన్ని పూర్తిగా ఎన్క్రిప్ట్ చేస్తామని వెల్లడించిన అధికారులు