Sports

ఇండియా జట్టు శ్రీలంక వెళ్లట్లేదు

ఇండియా జట్టు శ్రీలంక వెళ్లట్లేదు

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో భారత క్రికెట్‌ జట్టు శ్రీలంక పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ట్విటర్‌లో వెల్లడించింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత క్రీడాకారులను శ్రీలంక పర్యటనకు పంపడం సాధ్యం కాదంటూ బీసీసీఐ శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు తెలిపినట్టు సమాచారం. శ్రీలంకతో జులైలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు టీమిండియా వెళ్లాల్సి ఉంది. అయితే, తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ పర్యటన వాయిదా పడినట్టు ఐసీసీ తెలిపింది. కరోనాతో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు క్రీడోత్సాహానికి సిద్ధంగా ఉన్నతరుణంలో భారత్‌ × శ్రీలంక మ్యాచ్‌లు వాయిదా పడిన వార్త తమను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందని పేర్కొంటూ పలువురు క్రీడాభిమానులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు.