Agriculture

జత ఎడ్లు ₹17లక్షలు

Karnataka Pair Of Ox Sold For 17Lakhs

కర్ణాటకలో ఓ జత ఎడ్ల ధర అనూహ్యంగా రూ. 17లక్షలు పలికింది. రెండేళ్ల క్రితం వాటిని రూ. 8 లక్షలకు కొన్న ఓ రైతు.. అతనికే రికార్డు ధరకు విక్రయించాడు. కర్ణాటకలోని బాగల్​కోట్​లో జత ఎడ్లను రూ. 17 లక్షలకు అమ్మాడు ఓ రైతు. మహాలింగపుర్​లోని నందగావ్​లో సంగప్ప అనే వ్యవసాయదారు, అక్కిమారడికి చెందిన మల్లప్ప దగ్గరి నుంచి 2018లో ఆ ఎడ్లను కొన్నాడు. అప్పుడు వాటి విలువ రూ.8 లక్షలు. ఆ తర్వాత వాటికి రామ్​-లక్ష్మణ్​ అనే పేరు పెట్టి.. ఎంతో అపురూపంగా చూసుకున్నాడు సంగప్ప. 48 పోటీల్లో పాల్గొన్న ఈ ఎడ్లు ఇప్పటివరకు సుమారు రూ. 9 లక్షలు సంపాదించి పెట్టాయట. దాదాపు అన్ని రేసుల్లోనూ తొలి రెండు స్థానాల్లోనే నిలిచేవి.ఏమైందో తెలియదు కానీ.. ఇప్పుడు మళ్లీ మల్లప్పకే వాటిని రూ.17 లక్షలకు విక్రయించాడు సంగప్ప.