Sports

ఏపీలో అకాడమీ పెట్టాలని ఉంది

ఏపీలో అకాడమీ పెట్టాలని ఉంది

తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అకాడమీ పెట్టాలన్న కోరిక ఉందని ఏబీఎన్‌తో స్పోర్ట్స్‌ వర్సిటీ వీసీ కరణం మల్లీశ్వరి అన్నారు. స్పోర్ట్స్‌ వర్సిటీ వీసీగా తాను నియమింపబడటం సంతోషం ఉందని మల్లీశ్వరి తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కూడా స్పోర్ట్స్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని కరణం మల్లీశ్వరి అభిప్రాయపడ్డారు. దేశంలోనే మొదటిసారిగా ఢిల్లీ ప్రభుత్వం స్పోర్ట్స్ వర్సిటీ పెట్టిందని మల్లీశ్వరి తెలిపారు. స్పోర్ట్స్‌లో మంచి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం సపోర్ట్ ఉంటే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అకాడమీ పెట్టాలన్న కోరిక తనకు ఉందని మల్లీశ్వరి అన్నారు. క్రీడల్లో రాణించాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలన్నారు. తనకు ఎలాంటి సపోర్ట్ లేకపోయినా ఉన్నత స్థానానికి చేరుకున్నానని ఆమె తెలిపారు. 20 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో వర్సిటీ పెట్టాలని అనుకున్నా అవకాశం రాలేదని కరణం మల్లీశ్వరి అన్నారు.