NRI-NRT

చికాగోలో నాట్స్ క్రికెట్ పోటీల విజేతలు వీరే

చికాగోలో నాట్స్ క్రికెట్ పోటీల విజేతలు వీరే

నాట్స్ ఆధ్వర్యంలో చికాగోలో సూపర్ 8 క్రికెట్ టోర్నమెంట్ దిగ్విజయంగా నిర్వహించారు. చికాగో పరిసర ప్రాంతాలకు చెందిన 150మంది క్రీడాకారులు ఈ పోటీల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు. నిర్వహించింది. చికాగోతో పాటు చుట్టు పక్కల నివసిస్తున్న తెలుగు క్రికెట్ ప్లేయర్లు, అభిమానులు ఈ టోర్నమెంట్ విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఎవోలూటీజ్ లయన్స్ టీం ఛాంపియన్ షిప్ గెలుచుకుంది. అరోరా వారియర్స్ రన్నర్స్ గా నిలిచింది. నాట్స్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ హరీష్ జమ్ముల సమన్వయంలో జరిగిన ఈ పోటీలకు మదన్ పాములపాటి, మూర్తి కొప్పాక, విజయ్ వెనిగళ్ల, రవి శ్రీకాకుళం, కృష్ణ నిమ్మగడ్డ, లక్ష్మీ బొజ్జా, వేణు కృష్ణార్దుల, డాక్టర్ ప్రసుధ నున్నా, బిందు వీదులమూడి, కార్తీక్ మోదుకూరి, రాజేష్ వీదులమూడి, ఆర్.కె బాలినేని, పండు చెంగలశెట్టి, శ్రీనివాస్ బొప్పన, కృష్ణ నున్నా, కిరణ్ అంబటి, శ్రీకాంత్ బొజ్జ, అరవింద్ కోగంటి, అరుల్ బాబు, యాజ్నేష్ వెంకటేష్, కార్తీక్ మోదుకూరి, నరేన్ శర్మ, నరేష్ యాదా, వినోద్ బాలగురు, మనోహర్ పాములపాటి, రామ్ తూనుగుంట్ల తదితరులు సహకరించారు.