Sports

పీటీ ఉషపై పోలీసు కేసు

పీటీ ఉషపై పోలీసు కేసు

పరుగుల రాణి పీటీ ఉషపై చీటింగ్ కేసు నమోదైంది. పీటీ ఉష మోసం చేశారంటూ మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ బిల్డర్‌తో కలిసి ఉష తనను మోసం చేశారని జెమ్మా జోసెఫ్ ఆరోపించారు. ఉష హామీతో కేరళ కోజికోడ్‌లో ఓ బిల్డర్ నుంచి 1012 చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఈ స్థలం కోసం విడతలవారీగా రూ.46 లక్షలు చెల్లించినట్లు వివరించారు. అయితే స్థలాన్ని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించకుండా బిల్డర్ ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు మేరకు పీటీ ఉష సహా నిర్మాణ సంస్థకు చెందిన మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోజికోడ్ జిల్లా పోలీస్ చీఫ్ ఏవీ జార్జ్.. ఈ పిటిషన్‌ను వెల్లాయిల్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. సమగ్ర విచారణకు ఆదేశించారు.