DailyDose

మూడు రాజధానులపై మళ్ళీ బిల్లు పెడతాం!

మూడు రాజధానులపై మళ్ళీ బిల్లు పెడతాం!

అమరావతిపై హైకోర్టు తీర్పులో ఏముందో తెలియదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తీర్పు పూర్తిగా చదివాక అన్ని విషయాలపై మాట్లాడతానన్నారు. ‘‘హైకోర్టు తీర్పు మేము ఊహించిందే. అందులో కొత్తగా ఏమీ లేదు. పరిపాలన వికేంద్రీకరణకు ఈ క్షణం వరకు కట్టుబడి ఉన్నాం.త్వరలో మూడు రాజధానుల బిల్లు పెడతాం.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలో లేదో చర్చించి చెబుతాం.. చట్టాలు చేసేందుకే శాసనసభ, పార్లమెంట్‌ ఉన్నాయి’’ అని బొత్స తన అభిప్రాయం తెలిపారు.అయితే, రాజధాని అంశంలో హైకోర్టు తీర్పుపై సీఎం జగన్‌ సమీక్ష అనంతరం ప్రభుత్వ విధానాన్ని మంత్రి బొత్స వెల్లడించే అవకాశముంది.