NRI-NRT

తాళ్ళూరి సోదరులకు పలువురి పరామర్శ

తాళ్ళూరి సోదరులకు పలువురి పరామర్శ

తానా మాజీ అధ్యక్షుడు తాళ్ళూరి జయశేఖర్, ఆయన సోదరుడు, ప్రముఖ వైద్యుడు డా.రాజాల మాతృమూర్తి తాళ్ళూరి భారతీదేవి ఇటీవల మృతి చెందారు. గురువారం నాడు వారి స్వగ్రామం భద్రాచలం సమీపంలోని ఇరవెండిలో ఆమె సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఏపీ, తెలంగాణలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ఎన్నారైలు, తాళ్ళూరి కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. భారతీదేవికి నివాళులు అర్పించారు. ఆమె భర్త తాళ్ళూరి పంచాక్షరయ్యను పరామర్శించారు. తాళ్ళూరి రాజా, జయశేఖర్ సోదరులను కలిసి తమ సంతాపాన్ని వెల్లడించారు. తాళ్ళూరి రాజా వియ్యంకుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ తాతా మధు, కెనడాకు చెందిన ప్రవాసాంద్రుడు సూరపనేని లక్ష్మీనారాయణ, ఖమ్మంకు చెందిన ప్రముఖ ఎన్నారై బత్తిన ప్రకాష్, ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

1-1
1-4
1-5