DailyDose

ఆదోని వైసీపీలో వర్గ విబేధాలు.. కర్రలతో దాడి

ఆదోని వైసీపీలో వర్గ విబేధాలు.. కర్రలతో దాడి

కర్నూలు జిల్లాలోని ఆదోని మండలం సంతెకుడ్లూరులో మరోసారి వైసీపీలో వర్గ విబేధాలు వెలుగుచూశాయి. హోలీ ఊరేగింపు విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వారిని స్థానికంగా ఆస్పత్రికి తరలించిన స్థానికులు వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.