టీమిండియా మాజీ కెప్టెన్..సీఎస్కే ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే, అందరు అభిమానులు అనుకుంటున్నట్టు హీరోగా మాత్రం కాదు, నిర్మాతగా చిత్రాలు చేయనున్నాడని తెలుస్తోంది. తమిళంలో ఓ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నాడట. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార కీలక పాత్ర పోషించనుందని సమాచారం. నయన్ను హీరోయిన్గా తీసుకోవాలని సూపర్ స్టార్ రజినీకాంత్కు సన్నిహితుడైన సంజయ్ సీఎస్కే ఆటగాడు ధోనీకి సూచించినట్టు తెలుస్తోంది. మరి, ఈ చిత్రంలో ఆమె నటిస్తుందో, లేదో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార, స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ తో గత కొంతకాలంగా డేటింగ్ చేస్తుంది. ఈ లవ్బర్డ్స్ జూన్లో తిరుమలలో పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నయన్ కూడా ధోనీకి వీరాభిమాని. అందువల్ల ఈ ప్రాజెక్టులో ఆమె నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధోనీ బయోపిక్ ‘‘ఎమ్ఎస్. ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ’’ తమిళనాడులో భారీ విజయం సాధించింది. అప్పటి నుంచే కోలీవుడ్ సినీ ప్రేక్షకులకు అతడు తెలుసు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తుండటంతో క్రేజ్ కూడా విపరీతంగా ఉంది. దీంతో తమిళ్లో సినిమాను నిర్మిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం అతడికీ ఏర్పడిందట. అందుకోసమే తొలి సినిమాను కోలీవుడ్లో నిర్మించనున్నాడని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక నయనతార కెరీర్ విషయానికి వస్తే.. వరుస సినిమాలతో ఆమె ఫుల్ బిజీగా ఉంది. త్వరలోనే బాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్( తో ఓ సినిమా చేస్తుంది. ఈ చిత్రాన్ని అట్లీ తెరకెక్కిస్తున్నాడు.