DailyDose

ఉద్యోగుల‌కు కాఫీ అందించిన ట్విట్ట‌ర్ సీఈవో!

ఉద్యోగుల‌కు కాఫీ అందించిన ట్విట్ట‌ర్ సీఈవో!

మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీ సీఈవోను సాధార‌ణ ఉద్యోగి క‌ల‌వాలంటే అపాయింట్‌మెంట్ తీసుకోవ‌డం నుంచి ఆయ‌న క్యాబిన్‌లోకి వెళ్లే వ‌ర‌కూ సుదీర్ఘ ప్ర‌క్రియ ఉంటుంది. అలాంటిది సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట్ట‌ర్ సీఈవో ప‌రాగ్ అగర్వాల్‌ ఉద్యోగుల్లో ఒక‌రిలా క‌లిసిపోయి ఏకంగా వారి నుంచి కాఫీ ఆర్డ‌ర్లు స్వీక‌రించ‌డం ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది.ట్విట్ట‌ర్ లండ‌న్ కార్యాల‌యంలో ఈ విశేషం జ‌ర‌గ్గా సీఈవో అగ‌ర్వాల్ ఉద్యోగుల నుంచి కాఫీ ఆర్డ‌ర్లు తీసుకుంటూ వారికి కాఫీ స‌ర్వ్ చేసిన ఫోటోల‌ను ప‌లువురు ఉద్యోగులు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ట్విట్ట‌ర్ సీఎఫ్‌వో నెడ్ సెగ‌ల్ కూడా ఉద్యోగుల‌కు కాఫీ అందిస్తూ క‌నిపించారు.మ‌రో పోస్ట్‌లో అగ‌ర్వాల్‌, సెగ‌ల్ స్టాండప్ కామెడీ సెష‌న్‌లో ఉద్యోగుల‌ను ఆహ్లాద‌ప‌రుస్తూ క‌నిపించారు. లండ‌న్ టీ టైం అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ పోస్ట్‌లు నెటిజ‌న్ల‌ను అమితంగా ఆకట్టుకోగా నిరాడంబ‌రంగా ఉద్యోగుల‌తో మ‌మేక‌మైన ట్విట్ట‌ర్ సీఈవో ప‌రాగ్ అగ‌ర్వాల్‌ను ప‌లువురు ప్ర‌శంసించారు.