*అత్యంత సుందరంగా నిర్మితమవుతున్న ఆలయంఅక్టోబరులో లాంఛనంగా ప్రారంభం కానున్న గుడి
తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆదివారం నుంచి దుబాయి నగరంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. దుబాయిలోని జబల్ అలీలో నూతనంగా నిర్మిస్తున్న ఆలయంలో శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠ పూర్తయింది. పూర్తి ఆగమ శాస్త్ర ఆచారాలతో అత్యంత సుందరంగా నిర్మిస్తున్న ఈ ఆలయ సముదాయంలో ఇక్కడి భక్తుల మనోభావాలకు అనుగుణంగా వివిధ దేవతామూర్తులను ప్రతిష్ఠించగా, అందులో భక్తుల పాలిట కొంగు బంగారమైన ఏడుకాసుల వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఒకటి. ఆదివారం నుంచి
https://hind-utempledubai.qwaiting.com/main/booking వెబ్సైట్ ద్వారా ముందస్తుగా నమోదు చేసుకున్నవారిని మాత్రమే స్వామి వారిని ఉదయం 6 నుంచి రాత్రి 9వరకు దర్శించుకోవడానికి నిర్వాహకులు అనుమతిస్తారు. 1947కు పూర్వం నుంచి దుబాయిలో నివసిస్తున్న సింధీ వ్యాపారస్తులతో కూడిన సింధీ గురుదర్బార్ మందిర నిర్వహణ ట్రస్ట్ ఆలయాన్ని నిర్మిస్తోంది.