NRI-NRT

డా.కొడాలి శ్రీనివాస్ కుటుంబం మృతి చెందడానికి ముందు ఏమి జరిగిందంటే…

డా.కొడాలి శ్రీనివాస్ కుటుంబం మృతి చెందడానికి ముందు ఏమి జరిగిందంటే... Kodali Srinivas Family Funeral On October 1st. How did the accident happen?

ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో తానా బోర్డు సభ్యుడు, హ్యూస్టన్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య యలమంచిలి వాణిశ్రీ, ఇద్దరు కుమార్తెలు మేఘనా, నిఖిలలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడానికి ముందు ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. వాణిశ్రీకి దైవభక్తి మెండు. ఇద్దరు కుమార్తెలను తెలుగు సాంప్రదాయబద్ధంగా పెంచారు. నవరాత్రుల సందర్భంగా పెద్ద కుమార్తెను కాలేజీ నుండి ఇంటికి తీసుకురావటానికి చిన్న కుమార్తెతో కలిసి వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో నవరాత్రుల సందర్భంగా వాలర్‌లోని గోశాలలో గోవులను పూజించడానికి వెళ్లారు. గోశాలలో వారు గడిపిన సమయాన్ని ఫోటోలో జూమ్ చేసి చూడండి. గోశాల నుండి ఇంటికి బయలుదేరిన కొద్ది నిముషాల్లోనే కారు ప్రమాదానికి గురికావడం వారు మృతి చెందడం దురదృష్టకరం. ఈ సంఘటన అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తల్లి-కుమార్తెల మృతదేహాలకు అక్టోబర్ ఒకటో తేదీన హ్యూస్టన్లో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

డా.కొడాలి శ్రీనివాస్ కుటుంబం మృతి చెందడానికి ముందు ఏమి జరిగిందంటే...