Politics

ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో కువైట్ లో రక్తదాన శిబిరం

ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో కువైట్ లో రక్తదాన శిబిరం

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు గారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కువైట్ లోని జాబ్రియా బ్లడ్ బ్యాంక్ నందు NRITDP కువైట్ ఆధ్వర్యంలో గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు శ్రీ వెంకట్ కోడూరి, అధ్యక్షులు శ్రీ అక్కిలి నాగేంద్ర బాబు గార్ల అధ్యక్షతన రక్తదాన కార్యక్రమము విజయవంతం గా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నారా,నందమూరి అభిమానులు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అధ్యక్షులు nri tdp కమిటీ తరుపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం సీనియర్ నాయకులు వెనిగళ్ల బాల కృష్ణ ,గుండయ్య నాయుడు,సురేష్ మాలేపాటి,చిన్న రాజు,దివాకర్ ఓలేటి,శ్రీనివాస్ చౌదరి,లక్ష్మీపతి,బోయపాటి శ్రీను,నాయనేని సుధాకర్ గార్లు పాల్గొన్నారు.

అలాగే nritdp కువైట్ కమిటీ కార్యవర్గ సభ్యులు,నాలుగు గవర్నరేట్ కో ఆర్డినెటర్లు, జాయింట్ కో ఆర్డినేటర్ లు,కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమములో పాల్గొని విజయవంతం చేశారు.