Politics

రాష్ట్ర విభజనపై విచారణ ను వాయిదా వేసిన సుప్రీంకోర్టు..

రాష్ట్ర విభజనపై విచారణ ను  వాయిదా వేసిన సుప్రీంకోర్టు..

రాష్ట్ర విభజనపై ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణ వికాస్ కేంద్ర సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు

రాజ్యాంగ ధర్మాసనాలు కొన్ని ప్రత్యేక కేసులపై విచారణ చేపట్టిన నేపథ్యంలో కేసులును వాయిదా వేసిన సుప్రీంకోర్టు

బుధ, గురువారాల్లో కేవలం నోటీసులు ఇచ్చిన పిటిషన్లపై, తుది విచారణలో ఉన్న పిటిషన్లపై మాత్రమే వాదనలకు తీసుకోవాలని ఇటీవల ప్రత్యేక నిబంధన తీసుకువచ్చిన సుప్రీంకోర్టు.

సుప్రీంకోర్టు తాజా నిర్ణయం, రాజ్యాంగ ధర్మాసనాల కారణంగా ఈరోజు విచారణకు రావాల్సిన రాష్ట్ర విభజన పై దాఖలైన పిటీషన్లు వాయిదా

సుప్రీంకోర్టు తాజా సర్కులర్, రాజ్యాంగ ధర్మాసనం కేసు విచారణ నేపథ్యంలో రాష్ట్ర విభజన కేసు పై తేదీ నిర్ణయించాలని ప్రత్యేకంగా ప్రస్తావించిన ఉండవల్లి తరపు న్యాయవాది అల్లంకి రమేష్

గతంలో విచారణకు వచ్చినప్పుడు ఈరోజు విచారిస్తామని చెప్పిన త్రిసభ్య ధర్మాసనం.

రాష్ట్ర విభజన సహితుకంగా జరగలేదని దీనివల్ల రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు తలెత్తుతున్నాయని పిటిషన్ లో పేర్కొన్న ఉండవల్లి సహా పలువురు వ్యక్తులు

భవిష్యత్తులో రాష్ట్ర విభజన జరగాలంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు నియమ నిబంధనలు అవసరమని ఆ మేరకు కేంద్రానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్న పిటిషనర్లు

న్యాయవాది అల్లంకి రమేష్ విజ్ఞప్తితో పిటిషన్లపై విచారణను ఏప్రిల్ 11 కి వాయిదా వేసిన జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ పార్దేవాల ధర్మాసనం