సంజయ్, ఏపీ సీఐడీ చీఫ్
ఏడు ప్రాంతాల అసిస్టెంట్ రిజిస్ట్రార్ల నుంచి సీఐడీకి ఫిర్యాదులు వచ్చాయి.
విశాఖ, విజయవాడ, రాజమండ్రి గుంటూరులో ఫోర్మెన్ ఆఫ్ చిట్స్ ను విచారణ చేసాం.
1982 చిట్ ఫండ్ యాక్ట్ 76, 79 సెక్షన్ల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారు.
అన్ని బ్రాంచుల నుంచి డబ్బు మొత్తం వేరే చోటకు వెళ్ళిపోతుంది.
చిట్టీదారుడకు తన డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియదు.
జవాబుదారీతనం లేదని తెలడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశాం.
కస్టమర్ల డబ్బును వేరే చోట ఇన్వెస్ట్ చేయడం చిట్స్ రూల్సుకు వ్యతిరేకం.
విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు బ్రాంచుల ఫోర్మెన్లను కోర్టులో ప్రవేశపెట్టాం.
చిట్సులో ఎలాంటి నిబంధనలు ఉంటాయో ప్రజలకు తెలియదు.
అసిస్టెంట్ రిజిస్ట్రార్ల అనుమతితోనే చిట్ ప్రారంభించాలి.
రామకృష్ణ, ఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్
మార్గదర్శి రాష్ట్ర వ్యాప్తంగా 37 బ్రాంచీలు నిర్వహిస్తుంది.
ఫోర్మెనుకు ఎలాంటి చెక్ పవర్ లేకపోవడం నిబంధనలకు విరుద్ధం.
ఏపీలో అడిగితే హైదరాబాదులో ఉందని చెబుతారు.. అక్కడికి వెళ్తే సమాధానం చెప్పడం లేదు.
ప్రజల డబ్బుకు ఎవరు బాధ్యత వహిస్తారు.
మార్గదర్శి నిధులు ఉషోదయ కంపెనీకి తరలిస్తున్నారు.
ప్రజల సొమ్మును వారికి తెలియకుండా మూచ్యువల్ ఫండ్సుకు తరలించారు.
సీఐడీ విచారణతో పాటు చిట్ ఫండ్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.
మార్గదర్శి యాజమాన్యం అక్రమాలు ఎస్టాబ్లిష్ అయితే కంపెనీని మూసివేస్తాం