జిల్లా పోలీస్ కార్యాలయం మచిలీపట్నం
జనసేన ఆవిర్భావ సభ సందర్బంగా జాతీయ రహదారిపై ర్యాలీలు, సభలు నిర్వహించడానికి అనుమతి లేదు
ఈనెల 14-3-2023 వ తేదీ మంగళవారం నాడు మచిలీపట్నం మండల పరిధిలోని సుల్తానగర్ నందు నిర్వహించ తలపెట్టిన జనసేన పదో ఆవిర్భావ సభ సందర్భంగా విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్ళు జాతీయ రహదారి నెంబర్ 65 పై ర్యాలీలు గాని, బహిరంగ ప్రదర్శనలు నిర్వహించడానికి అనుమతి లేదు . కృష్ణాజిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ ఆక్ట్ అమల్లో ఉన్నది. జాతీయ రహదారి గుండా ప్రయాణాలు సాగించే సామాన్య ప్రజానీకానికి, అత్యవసర సర్వీసులైన మెడికల్, ఫైర్, ఇతర వాహనాలకు ఎటువంటి అంతరాయం కలిగించరాదు. పోలీసు వారి అనుమతులకు విరుద్ధంగా ర్యాలీలు గాని, బహిరంగ ప్రదర్శనలు గాని నిర్వహిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని కృష్ణాజిల్లా ఎస్పీ శ్రీ పి. జాషువా ఐపీఎస్ గారు పత్రికా ముఖంగా తెలియపరిచారు.