Politics

‘ఈస్టిండియా కంపెనీ పోయి నార్త్ ఇండియా కంపెనీ వచ్చింది’

‘ఈస్టిండియా కంపెనీ పోయి నార్త్ ఇండియా కంపెనీ  వచ్చింది’

కేంద్రంలో BJP సర్కారుపై సినీనటుడు, MNM అధ్యక్షుడు కమల్ హాసన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘దేశం నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వెళ్లిపోయింది. ఇప్పుడు నార్త్ ఇండియా కంపెనీ వచ్చింది. దీన్ని ఎలా అంగీకరిస్తాం?’ అని కమల్ వ్యాఖ్యానించారు. తమిళనాడులోని ఈరోడ్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున కమల్ ప్రచారం చేస్తున్నారు. ప్రజల భవిష్యత్తుతో పాటు యావత్ దేశాన్ని తాకట్టు పెట్టడాన్ని చూస్తూ ఉండబోమని అన్నారు.