Politics

22 ఏళ్లుగా పాలనా ప్రజల కోసమే కవిత వాక్యాలు…

22 ఏళ్లుగా పాలనా  ప్రజల కోసమే  కవిత వాక్యాలు…

గత 22 ఏళ్లుగా ప్రజల కోసమే భారాస పనిచేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అనేక మంది కార్యకర్తలు పార్టీ కోసం జీవితాలను త్యాగం చేశారని కొనియాడారు. మక్లూర్‌లో నిర్వహించిన భారాస ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డితో కలిసి కవిత పాల్గొన్నారు.ఒకప్పుడు గులాబీ కండువా కప్పుకుంటే అందరూ ఎగతాళి చేసేవారని, ఇప్పుడు గర్వపడుతున్నామని MLC కవిత తెలిపారు.ఎంతోమంది కార్య కర్తలు పార్టీ కోసం జీవితాలను త్యాగం చేశారు. వారి త్యాగఫలమే కాళేశ్వరం జలాలు’ అని పేర్కొనారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికల్లో భాజపా పని అయిపోయిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంతో ఉన్నారన్నారు. భాజపా పాలిత రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం మోడల్‌గా మారిందన్నారు.