WorldWonders

ప్రపంచంలోనే తొలి 3డి ప్రింటెడ్ టెంపుల్ తెలంగాణలో రానుంది….

ప్రపంచంలోనే తొలి 3డి ప్రింటెడ్ టెంపుల్ తెలంగాణలో రానుంది….

సిద్ధిపేట శివారులో త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో ఓ ఆలయం రూపుదిద్దుకుంటోంది. రోబో సాయంతో పనులు చేపట్టడం ఇక్కడి ప్రత్యేకత. ఈమేరకు హైదరాబాద్‌కు చెందిన అప్సుజా ఇన్‌ఫ్రాటెక్‌ కంపెనీ ఆధ్వర్యంలో.. సిద్దిపేట అర్బన్‌ మండలం బూరుగుపల్లిలో నిర్మిస్తున్న ఓ టౌన్‌షిప్‌ ఆవరణలో ఈ ఆలయం రూపుదాలుస్తోంది. 3,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో 30 అడుగుల ఎత్తులో రోబో సాయంతో ఈ ఆలయాన్ని 3 భాగాలుగా నిర్మిస్తున్నారు.

ఆలయంలో శివుడు, పార్వతి, వినాయకుడి గర్భగుడులు ఉంటాయి. ఇప్పటికే వినాయకుడు, శివాలయాలు పూర్తయ్యాయి. రోబోలో సాఫ్ట్‌ వేర్‌ను అప్‌లోడ్ చేయడం ద్వారా ఈ ఆలయం నిర్మాణం చేపడుతున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తున్నామని, ప్రపంచంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ ఆలయం ఇదేనని కంపెనీ ప్రతినిధులు మీడియాకు తెలిపారు.