Politics

ప్రొద్దుటూరు నియోజవకర్గంలో లోకేశ్ యువగళం….

ప్రొద్దుటూరు నియోజవకర్గంలో లోకేశ్ యువగళం….

జగన్ ది ఫ్యాక్షన్ మనస్తత్వం జగన్ పాలనలో అన్ని రంగాల వారు బాధితులే, సొంత జిల్లా కడప, సొంత నియోజకవర్గం పులివెందులకి ఏం చేశాడో జగన్ చెప్పగలడా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరారు. యువగళం పాదయాత్రలో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లిలో వివిధరంగాల ప్రముఖులతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు.

సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ,ఉమ్మడి కడప జిల్లాలో పదికి పది సీట్లు ఇస్తే జగన్ చేసింది ఏంటి? దొంగ చేతికి తాళం ఇస్తే ఏం జరిగింది? అందరూ దోపిడీకి గురయ్యారని విమర్శించారు. లాయర్లు, డాక్టర్లు, వ్యాపారస్తులు, టీచర్లు, ఐటీ నిపుణులు అందరూ జగన్ చేతిలో బాధితులేనని అన్నారు.