Devotional

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ….

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ….

తిరుమల :జూన్ 10
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. నేడు శనివారం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక శుక్రవారం తిరుమల శ్రీవారిని 74,502 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.73 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 38,052 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు…